నవతెలంగాణ – హైదరాబాద్ : జమ్మూకాశ్మీర్ – పూంచ్ బార్డర్లో మరో దారుణం చోటుచేసుకుంది. సెక్టర్లో ఎయిర్ ఫోర్స్ వాహనాలపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అంతేకాకుండా వాహనాల అద్దాలు డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.