ప్రత్యేక విధుల్లో చేరిన ఎఫ్.ఆర్.ఓ మురళి

నవతెలంగాణ – అశ్వారావుపేట

పంచాయితీ పాలక వర్గాల పాలనా కాలం జనవరి 31తో ముగియడంతో మంగళవారం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.రామన్నగూడెం,వేదాంతపురం పంచాయితీలు కు కేటాయించిన ఎఫ్.ఆర్.ఒ మురళి బుధవారం ప్రత్యేక బాధ్యత విధుల్లో చేరారు.రామన్నగూడెం కు ఎస్.టీ మహిళ మెడకు స్వరూప సర్పంచ్ గా పనిచేసారు.ఈ పంచాయితీలో దీర్ఘకాలికంగా భూ సమస్య పరిష్కారం కాలేదు.అటవీ భూమి లో పట్టాలు ఉన్నాయని అక్కడ గిరిజనులు,అదంతా రక్షిత అటవీ ప్రాంతం అని అటవీ అధికారులు వాదిస్తున్నారు.వేదాంతపురం పంచాయితీ ఎస్టీ జనరల్ కావడంతో విద్యావంతుడు సోనీ శివశంకర్ ప్రసాద్ తన పాలనా కాలంలో ప్రత్యేకతను చాటుకున్నారు.
Spread the love