మండలంలోని చౌట్ పల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంగా జమున ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా అవార్డును అందుకున్నారు.ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శి ఉత్తమ పంచాయతీ కార్యదర్శి గా అవార్డు పొందడం పట్ల ఎంపీడీవో సంతోష్ రెడ్డి, మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.