ఆలయాన్ని దర్శించుకున్న ఎస్బిఐ జనరల్ మేనేజర్

నవతెలంగాణ- భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలోని దక్షిణ కాశీ శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయాన్ని హైదరాబాద్ ఎస్బిఐ జనరల్ మేనేజర్ మంజు శర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీధర్ శాలువాతో సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రామగిరి శర్మ, రాజేశ్వర శర్మ, సిద్దేశ్వర్ పంతులు, కామారెడ్డి ఏజీఎం, భిక్నూర్‌ ఎస్బిఐ మేనేజర్, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love