కరెంట్ షాక్ తో బాలిక మృతి

నవతెలంగాణ – రాయపర్తి
విద్యుత్ షాక్ తో బాలిక మృతి చెందిన సంఘటన మండలంలోని సన్నూర్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మండలంలోని సన్నూరు గ్రామానికి చెందిన చెడుపాక రవి కిరణ్ – రమ దంపతుల ఏకైక కుమార్తె శ్రీవిద్య (5) శుక్రవారం తన ఇంట్లోని నీటిని వేడి చేసే కరెంట్ హీటర్ ని ప్రమాదవశాత్తు పట్టుకుని కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ అల్లరి చేసే చిన్నారి ఒకేసారి విగతాజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ హృదయ నిదారకమైన ఘటన చూసి గ్రామస్తులు సైతం చలించిపోతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన గ్రామంలో పసిపాప అందులో ఒక్కగానొక్క కూతురు శ్రీవిద్య మృతి చెందడంతో ఆ కుటుంబంలోని దుఃఖానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీవిద్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Spread the love