భువనగిరి పార్లమెంట్ టికెట్ ఎవరికైనా ఇవ్వండి: ఎమ్మెల్యే

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
మునుగోడు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఎంపీ టికెట్ కోరుతున్నాం అని కొన్ని పత్రికలలో,చానల్లో వస్తున్న ప్రచారం అవాస్తవం అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పారు. బీసీ నాయకుడికి భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తే రాష్ట్రంలోనే భువనగిరి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపిస్తా అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.కోమటిరెడ్డి లక్ష్మి గారికి ఎంపీ టికెట్ కావాలని కోరడం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని నిర్ణయించిన భువనగిరి ఎంపీగా గెలిపిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ గా మా హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు పదవులను ఆశించలేదని,నామినేటెడ్ పదవులు కావాలని కోరినట్టు చరిత్రలోనే లేదని  ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని కామెంట్ చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కి పదవులు ముఖ్యం కాదు ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకోవడమే తమ లక్ష్యం అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి చౌటుప్పల్ సింగిల్విండో చైర్మన్ చెన్నగోని అంజయ్యగౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి మండల అధ్యక్షుడు బోయ దేవేందర్ చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు సుర్వి నరసింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love