“గోకుల్ చాట్”అధినేత ముకుంద్ దాస్ కన్నుమూత..

నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 
 దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన కోఠి లోని ‘గోకుల్ చాట్’ వ్యవస్థాప కుడు ముకుందా దాస్ విజయ వర్గీయ (75) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడు తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులు కాచిగూడలోని ఓ ఆసుప త్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముకుందాస్ మృతితో కోఠి, సుల్తాన్ బజార్ లో విషాదం నెల కొంది. మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ , బిజెపి నాయకులు గోవింద్ రాఠీలతో పాటు బంధు వులు సుల్తాన్ బజార్ లోని నివాసానికి చేరుకొని భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం ఇమ్లిబన్ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. 1966లో కోఠిలో ‘గోకుల్ చాట్’ పేరిట చాట్ భండార్ ఏర్పాటుచేశారు. రుచి, శుచితో చాట్ ప్రియుల ఆదరణ చూరగొని ఖ్యాతి పొందారు
Spread the love