భవన నిర్మాణ కార్మికున్ని ప్రభుత్వం ఆదుకోవాలి

– భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రాధారపు మల్లేశం
నవ తెలంగాణ – వలిగొండ రూరల్
అరూర్ గ్రామ మధిర గ్రామమైన అప్పారెడ్డిపల్లి కి చెందిన   భవన నిర్మాణ కార్మిక పనుల నిమిత్తం వెళ్లి వస్తూ ప్రయాణంలో యాక్సిడెంట్ కు గురైన భవన నిర్మాణ కార్మికుడు కొల్లూరి రామచంద్రాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాధారపు మల్లేశం డిమాండ్ చేశారు. శనివారం అప్పారెడ్డి పల్లి లో  రామచందర్ ను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ పనుల నిమిత్తం వెళ్లి వస్తు ప్రమాదానికి గురై పనులు చేయకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న కొల్లూరు రామచంద్రం ను ప్రభుత్వం ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రమాద బీమా కింద రూ.2లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
Spread the love