పట్టభద్రులారా… ఆలోచించి సరైన నాయకునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి

Oplus_0

నవతెలంగాణ – తిరుమలగిరి 
నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి సరైన నాయకునికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి కడియం రామచంద్రయ్య అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశమంతా మోడీ  వైపే చూస్తుందని, కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకటేనని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు బీజేపీకే ఉందని, పట్టభద్రులు చైతన్యవంతులని, ఎవరికి ఓటు వేయాలో తప్పకుండా ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కంటే ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి సరిగా అమలు చేయడం లేదని అన్నారు. నిరుద్యోగులను పట్టభద్రులను ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేయడంలో ముందుంది అన్నారు. గత ప్రభుత్వం పోకడలే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా  పోతుందన్నారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. రుణమాఫీ చేయలేదని ఎకరానికి 15,000 ఇవ్వలేదని, కౌలు  రైతులకు 15,000 పడలేదని అన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఒకప్పుడు బిజెపి నాయకులేనని ప్రజలు అది గుర్తుంచుకోవాలని సూచించారు. దేశమంతా మోడీ  రావాలని కోరుకుంటున్నారని, పార్టీ కోసం సిద్ధాంతం కోసం దేశం కోసం విద్యార్థి దశ నుంచే బిజెపి పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలకై  నిరంతరం శ్రమిస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

Spread the love