దూపల్లి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం దుపల్లి పాఠశాలలు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు, పిఆర్టియు మండల అధ్యక్షులు టి. సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, పరమేశ్వర్, రాధా, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love