ఘనంగా జానారెడ్డి  జన్మదిన వేడుకలు

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నందికొండ మున్సిపాలిటీ మూడవ వార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ ఆధ్వర్యంలో వార్డు సభ్యుల సమక్షంలో ఘనంగా మాజీ మంత్రి కుందూరు జానా రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా  కౌన్సిలర్ మాట్లాడుతూ.. జానా రెడ్డి నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో అష్టైశ్వరలతో వర్ధిల్లాలని నాగార్జునసాగర్ నియోజకవర్గంలో తిరుగులేని  మహానుభావుడిగా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను అని తెలిపారు. అనంతరం మూడో వార్డులో  కేకును కట్ చేసి ఇంటింటికి తిరిగి స్వీట్లు పంపిణీ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి నరసింహ రావు(చిన్ని), భవాని,షహన్ వాజ్, సాంబశివరావు,కుమార్, నవరత్న కుమారి,అరుణ్,నాగార్జున(బ్రో), షరాబంది, కుత్బుద్దిన్, లక్ష్మి, మల్లేష్ మరియమ్మ, వెంకటేశ్వర్లు, అంజమ్మ, విష్ణుమూర్తి మరియు వార్డు సభ్యులు తదితరులున్నారు.
Spread the love