తెలంగాణ ఫైనాన్స్ మిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య నియామకంపై హర్షం

తెలంగాణ ఫైనాన్స్ మిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య నియామకంపై హర్షం– ఏవైయు జిల్లా ఉపాధ్యక్షుడు కేసారపు సురేందర్
నవతెలంగాణ- మల్హర్ రావు: తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా వరంగల్ మాజీ ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరిసిల్ల రాజయ్య, సభ్యులుగా సంకేపల్లి సుధీర్ రెడ్డి,నెహ్రూ నాయక్ మాలోత్,ఎం రమేశ్ ను నియమిస్తూ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ తమిలసై సౌందర్రాజన్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేయడంపై భూపాలపల్లి జిల్లా అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ ఏవైయు ఉపాధ్యక్షుడు కేశారపు సురేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం రాజయ్యను మర్యాద పూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాజయ్య నియమించడంపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రేవంత్ రెడ్డికి, ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబుకు, పంచాయతీ శాఖ మంత్రి సితక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love