పాలకుడిగా కాదు సేవకుడిగా పని చేస్తా..

– ప్రచారంలో  బీఆర్‌ఎస్‌ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ 
నవతెలంగాణ- మల్హర్ రావు: మంథని నియోజకవర్గ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు వారికి పాలకుడిగా కాదు సేవకుడిగా పని చేస్తానని బీఆర్‌ఎస్‌ మంథని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదుకర్ అన్నారు. మంగళవారం మండలంలోని నాచారం, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో భూపాలపల్లి జిల్లా జెడ్పి చైర్మన్ జక్కు శ్రీహర్షిని తో కలిసి గడపగడపకు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్ట మాట్లాడారు. మంథని నియోజకవర్గం అభివృధ్దిలో పరుగులు పెట్టాలంటే ఇక్కడ బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఇప్పటికే తాను ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, ఈ ప్రాంత అభివృధ్దితో పాటు తన తల్లిపేరున స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక సేవలు అందించానన్నారు. సంక్షేమ, అభివృద్ది, సేవ నా ప్రధాన ఏజేండాలని ఆయన అన్నారు. తొమ్మిదేండ్లుగా మంథని నియోజకవర్గాన్ని తన కుటుంబంగా బావించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. సబ్బండ వర్గాల అభివృద్దే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని అన్నారు. బీసీ బిడ్డగా నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్తిగా బరిలో నిల్చున్నానని, ప్రజలు ఆశీర్వదించాలన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనీఫెస్టోలో పొందుపర్చిన ప్రతి పథకం గొప్పవని, కేసీఆర్‌ బీమా, ఫించన్‌ల పెంపు, సౌభాగ్యలక్ష్మి ద్వారా ప్రతి మహిళకు రూ.3వేలు, ఇలా ఇంకా అనేక పథకాలు అమలు చేయడం జరుగుతుందని, ఈ పథకాలతో పాటు తన సొంతంగా సేవలు అందిస్తామన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంతో మంది పేద బిడ్డలు ఉన్నత చదువులు చదువుకునే ఆరాటం ఉన్నా అవకాశం లేక చదువుకు దూరం అవుతున్నారని, అలాంటి వారికి హైదరాబాద్‌లో రెండు హస్టల్‌లు ఏర్పాటు చేసి పైసా ఖర్చు లేకుండా పై చదువులు చదివించే బాధ్యత తీసుకుంటానన్నారు. అంతేకాకుండా ఆడబిడ్డలకు గతంలో సామూహిక వివాహలు జరిపించినట్లుగానే మంథని, కాటారంలలో ఆడబిడ్డకు మేనమామనై వివాహం జరిపిస్తానన్నారు. గృహలక్ష్మిపథకం ద్వారా ఇళ్లు మంజూరీ చేయించి ఆ ఇంటి నిర్మాణంలో కొంత సాయం చేసి దగ్గరుండి పూర్తి చేయించి గృహ ప్రవేశం చేయిస్తానని ఆయనహమీ ఇచ్చారు. మంథని నియోజకవర్గ అభివృధ్ది కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేయి కోట్లు ప్రకటించారని, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేయికోట్లతో మంథని రూపు రేఖలు మార్చుతానన్నారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గిరిజనుల సంక్షేమం కోసం ఐటీడీఏ ఏర్పాటు చేయిస్తానని, మంథని మండలం ఆరెంద మానేరుపై బ్రిడ్జి నిర్మాణంతో పాటు అనేక సమస్యలు తీర్చుతానని ఆయన అన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని, బీసీ బిడ్డగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మైనార్టీలు ఆలోచన చేసి ఆదరించాలన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదన్నారు. కేవలం రాజకీయంగా ఎదిగినోళ్లను, ప్రతిపక్షాలను రాజకీయ సమాధి చేయడంలో మాత్రమే రికార్డు కొట్టారని ఆయన ఎద్దేవా చేశారు. నాలుగేండ్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే ఈ ప్రాంత అభివృధ్దిని పేదోళ్లకు తనవంతుగా సేవ చేసి చూపించానని ఆయన గుర్తు చేశారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లకు అవకాశం ఇస్తె ఎలా అభివృధ్ది చేస్తారో మీరే చూశారని, అభివృధ్ది, సేవలు మీ కళ్ల ముందే కనబడుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ సభ సక్సెస్‌కు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి మరువలేనిదని, సమిష్టిగా ప్రజలను తరలించడంలో ఎంతో కష్టపడ్డారని ఆయన కొనియాడారు. నియోజకవర్గ ప్రజలు సైతం బీసీ బిడ్డను కాపాడుకోవాలని బారీగా తరలివచ్చి ఒక మంచి సందేశం ఇచ్చారని, అంచనాకు మంచి ప్రజలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు గొనె శ్రీనివాసరావు, పిఏసిఎస్ చైర్మన్ చేప్యాల రామారావు, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాఘవ రెడ్డి,యూత్ అధ్యక్షుడు హరీష్, మంథని మార్కెట్ వైస్ చైర్మన్ పుట్టపాక శ్రీనివాస్, సర్పంచ్ కాసాని రామయ్య,నాయకులు తాజాద్దీన్, యదగిరిరావు, ప్రకాస్ రావు పాల్గొన్నారు.
Spread the love