పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత: ఎస్పీ

నవతెలంగాణ – సిరిసిల్ల
పోలీస్ అధికారులు, సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని , వారి ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో తారక రామ హాస్పిటల్ , లక్ష్మీ నరసింహ  హాస్పిటల్స్ ఆధ్వర్యంలో  గురువారం   సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా హాజరై పోలీస్ సిబ్బందితో పాటు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ వైద్య శిబిరంలో అధికారులకు,సిబ్బందికి పరీక్షలు నిపుణులైన వైద్యులతో  నిర్వహించడంతో పాటు, సిబ్బందికి వైద్యులు తగు సూచనలు, సలహాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ….నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్న  పోలీస్ సిబ్బంది ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే విధులు సమర్థంగా నిర్వహించగలరన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యమే మా ప్రథమ ప్రాధాన్యత అని పోలీసులు రాత్రింబవళ్లు పని చేయడంతో పాటు ప్రతిరోజు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని,సిబ్బందికి మద్దతుగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు లు,యోగ, క్రీడల నిరహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే గొప్ప సంపద అని, పౌరులకు నిష్కళంకమైన సేవలను అందించడంలో ప్రతి పోలీసు జీవితంలో ఆరోగ్యం ఎలా కీలక పాత్ర పోషిస్తుందో కూడా వివరించారు.పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు వైద్యుల సలహాలను పాటించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి, నాగేంద్రచారి,సి.ఐ లు రఘుపతి,  అనిల్ కుమార్,శ్రీనివాస్ , ఆర్.ఐ లు యాదగిరి, రమేష్  పోలీస్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love