- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మహారాష్ట్ర రాజధాని ముంబైతో పాటు దాని పరిసర ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ముంబై, పాల్ఘర్ జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. థానే జిల్లాకు ఆరెంజ్ అలర్ట్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వరద నీరు రోడ్లపైకీ భారీగా చేరడంతో బుధవారం ఉదయం ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
- Advertisement -



