- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తమిళనాడులోని చెన్నై-బెంగళూరు ఎన్హెచ్-48 జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వస్తున్న రెండు బైకులను ఎదురుగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకులపై ప్రయాణిస్తున్న కె. అనబళగన్ (68), ఆర్. సుబ్రమణి (72), ఎస్. అరుణ్కుమార్ (22) అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -


