దుబాయ్: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వేటు వేసింది. ప్రపంచకప్ వైఫల్యంతో శ్రీలంక క్రికెట్ బోర్డును తొలుత ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. బోర్డు తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డులు స్వతంత్రంగా వ్యవహరించాలి. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం కారణంగా ఐసీసీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.