రాహుల్ విజరు, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్లో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేస్తుండగా, గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. సోమవారం ప్రసాద్ ల్యాబ్స్లో టీజర్ లాంచ్ ఈవెంట్ను నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘రాజకీయ నాయకులు పోలీసులును ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే సినిమా ఉంటుంది. పోలీసులు పడే ఇబ్బందులు, బాధలు ఇందులో
ఉంటాయి. చాలా సంతప్తిని ఇచ్చిన కథ ఇది’ అని అన్నారు. ‘ఇదొక హానెస్ట్ అటెంప్ట్. ఈ నెల 24న ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాం’ అని రాహుల్ విజరు చెప్పారు. దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ, ‘నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసులే ఓ కేసులో ఇరుక్కుని ఎలా అవస్థలు పడ్డారనే కాన్సెప్ట్తో ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని అన్నారు. ‘తేజ డైరెక్షన్తో పాటు కాశీ నాగేంద్ర రాసిన డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ఎలక్షన్స్లో పాల్గొనే వారికి, పొలిటిషీయన్స్కు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ప్రభావితం చేసేలా ఉంటాయి. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా దీన్ని రూపొందించారు. సిస్టమ్ పాలిటిక్స్కు ఎలా లొంగిపోయిందనేది కాన్పెస్ట్. ఏ పార్టీకి కొమ్ము కాసేలా ఈ సినిమా ఉండదు’ అని నిర్మాతలు బన్నీవాస్, విద్యా కొప్పినీడి అన్నారు.