కోళ్ల ఫామ్ నిర్మాణ స్థలం పరిశీలన..

నవతెలంగాణ – రాయపర్తి

మండలంలోని పన్యా నాయక్  శివారులో నిర్మిస్తున్న ఈసి ( ఎన్విరాన్మెంట్ కంట్రోల్ ) పౌల్ట్రీ ఫామ్ నిర్మిస్తుండగా స్థానికులు అభ్యంతరం తెలుపుతూ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దాంతో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గురువారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్క రైతులతో మాట్లాడి వారి వాంగ్మూలని స్వీకరించారు. అనంతరం తహశీల్దార్, ఎంపీడీఓ విలేకరులతో మాట్లాడుతూ… ఈసీ కోళ్ల ఫామ్ నిర్మాణానికి సంబంధించిన అధికారులు అనుమతులు ఇచ్చారు అని వివరించారు. కోళ్ల ఫామ్ నిర్మాణంపై స్థానికులు,చుట్టూ రైతుల నిర్ణయాలను సేకరించాము అని తెలిపారు. పూర్తి నివేదికను కలెక్టర్ కు అందించడం జరుగుతుంది అన్నారు. స్థానికులు సైతం సమన్వయం పాటించాలని ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించవచ్చని చెప్పారు. వారితో పాటు ఎంపిఓ తుల రాంమ్మోహన్, ఆర్ఐ చంద్రమోహన్, సర్వేయర్ వీరస్వామి, జిపి కార్యదర్శి భూక్య మహేందర్ తదితరులు ఉన్నారు.
Spread the love