మేడారంలో ముమ్మరంగా పారిశుద్ధ పనులు

– పంచాయతీ కార్యదర్శి సత్తీష్ దగ్గరుండి పనుల నిర్వహణ
నవతెలంగాణ -తాడ్వాయి
మేడారం మహా జాతరకు ముందస్తుగా రెండు నెలల ముందు నుండే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మన దేవతలను దర్శించుకొని విడిది ప్రదేశాలలో చెత్తాచెదారాన్ని, ప్లాస్టిక్ కవర్లు, కళేబరాలను వదిలివేసి వెళ్తున్నారు. ముందస్తుగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య ఆదేశాల మేరకు మేడారం స్థానిక పంచాయతీ కార్యదర్శి కొర్నేబెల్లి సతీష్ దగ్గరుండి ముమ్మరంగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నారు. సిబ్బందితో, కూలీలతో మేడారం వ్యాప్తంగా చుట్టు పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉన్న పారిషిత్యాన్ని ముమ్మరంగా తొలగించి, బ్లీచింగ్ పౌడర్ ను చలిస్తున్నారు. మేడారం పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో సీజన్ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Spread the love