ధరణి సమస్యలపై ముఖాముఖి

నవతెలంగాణ – నవీపేట్: ధరణి సమస్యలపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ హాలులో శనివారం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సంబంధిత సమస్యలతో దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలను  అడిగి తెలుసుకున్నారు. అందుకు గల కారణాలను అధికారుల నుండి అడిగి తెలుసుకుని ప్రతి దరఖాస్తును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హత గల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని వాస్తవ నివేదికను ఆర్డీవో లాగిన్ కు ఫార్వర్డ్ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హులైన న్యాయమైన రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా అధికారులు యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేలా కృషి చేయాలని అర్హులైన వారికి పట్టా పాస్ బుక్కులు, సక్సేషన్, నాల కన్వర్షన్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హంధాన్, ఆర్డిఓ రాజేంద్ర కుమార్, ఎంపీపీ శ్రీనివాస్, తహసిల్దార్ నారాయణ, ఎంపీడీవో నాగనాథ్, సంబంధిత అధికారులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
Spread the love