కేసీఆర్ చేతులమీదుగా బీఫాం అందుకున్న జైపాల్ యాదవ్

నవతెలంగాణ-ఆమనగల్ : కల్వకుర్తి నియోజకవర్గం  బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జైపాల్ యాదవ్ బీఫాం అందుకున్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆపార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా బీఫాం అందుకున్నట్టు జైపాల్ యాదవ్ తెలిపారు. పటిష్టంగా ప్రచారం నిర్వహించి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్టు ఆయన పేర్కొన్నారు.
Spread the love