కాంగ్రెస్ వస్తేనే ఉపాధి హామీకి బతుకుతెరువు: జీవన్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్ 
కాంగ్రెస్ వస్తేనే ఉపాధి హామీకి బతుకు తెరువుకు గ్యారంటీ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపత్రి జీవన్ రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి లు అన్నారు.
మండలం లోని గోవింద్ పెట్ ,చేపూర్, పి ప్రి గ్రామాలలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీలతో సమావేశం , ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదరించండి.. అండగా నిలువండి..ఎంపీగా దీవించండి..కాంగ్రెస్ వస్తేనే ఉపాధి హామీకి.. బతుకు దెరువుకు గ్యారంటీ..ఉపాధి హామీ కూలి రు.400 లకు పెంచుతాం అని అన్నారు. వేసవిలో 35 శాతం అదనంగా బోనస్ చెల్లిస్తాం అని.ప్రతి కూలీకి బ్యాంక్ ఖాతాలో సంవత్సరానికి 40వేలు ఇస్తాం అని,కాంగ్రెస్ పార్టీ కి పేరు వస్తుందని,మోడీ ఉపాధి హామీ పథకానికి ఏటా నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం  చేస్తున్నారు. అనికాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యం..కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ..ఆత్మీయంగా మాట్లాడారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అండగా నిలువాలని, ఎంపీగా గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను అభ్యర్థించారు. రోజు వారి వేతనం 400 లకు పెంచుతామని హామీ ఇచ్చారు. గ్రామం అభివృద్ధి చెందాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా  కాంగ్రెస్కే ఓటేస్తెనే సాధ్యం. అని అన్నారు. ఇంటింటా తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని కాంగ్రెస్ కార్యకర్తలు పరిశీలించి అర్హులందరికీ పథకాలు అందించాలని జీవన్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో సోనియా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించారు అని, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి కల్పించేందుకు ఉపాధి హామీ పథకం ప్రారంభిస్తే బిజెపి ప్రభుత్వం కూలీలకు చెల్లించే వేతనంలో కోతలు పెడుతోంది అని ధ్వజమెత్తారు.
ప్రతి కుటుంబానికి ఏడాదికి వంద రోజులు పనులు కల్పించాలనే నియమాన్ని బీజేపీ ప్రభుత్వం తుంగలోతోక్కి పని దినాలు తగ్గించింది. అని ఏటా ఉపాధి హామీ పథకం నిధులు పెంచాల్సి ఉండగా, నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారు. అని,మరోసారి బిజెపి అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది అని అన్నారు. ప్రజలు బిజెపి మోసపూరిత మాటలు నమ్మి మోసపోవద్దని మహిళలను వేడుకొన్నారు. పనిచేసే చోట మౌలిక వసతులు.. ఉపాధి కూలీలను తరలించేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తాం అని,రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పని కల్పిస్తాం. అని గతంలో రుణమాఫీ చేసినం..వచ్చే ఖరీఫ్ నాటికి 2 లక్షలు మాఫీ చేస్తాం. అని అన్నారు.ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పదేళ్లుగా భర్తీ చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ   చేస్తాం.,వేసవిలో కులీలకు 35 శాతం అదనంగా బోనస్ చెల్లిస్తాం.ప్రతి ఉపాధి హామీ కూలికి రోజువారి వేతనం 400 అందిస్తామని భరోసానిచ్చారు.బిజెపి కుట్రలు ఇక పై కొనసాగాయి..ఆడ బిడ్డలు కాంగ్రెస్ వెంటే ఉన్నారు..ప్రతి ఉపాధి హామీ కూలికి ఏటా రు.40 వేలు ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓటేసి, ఎంపీ గా గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరినారు. ఈ కార్యక్రమంలో మార్కుఫెడ్ చైర్మన్ గంగారెడ్డి . మాజీ గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ ,మాజి జడ్పీ చైర్మన్ గంట సదానందం ,  మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి  బ్లాక్ అధ్యక్షులు ఇస్సాపల్లి జీవన్ ,  ఎంపీపీ పస్కా నరసయ్య ,  మండల నాయకులు బుల్లెట్ రమేష్ ,దేగం ఎంపిటిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ ,ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి , గోవిందపేట మాజీ సర్పంచ్ గంగాధర్ ,మూగ ప్రభాకర్ ,పిప్రి జీవన్ రెడ్డి ,భూమా రెడ్డి ,రాజా రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love