బీసీ సెల్ నియామక పత్రం అందజేత

నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణంలోని పివిఆర్ భవన్ లో  నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ రెడ్డి జిల్లా ఓబీసీ ఛైర్మన్ డి రాజా నరేంద్ర గౌడ్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు దొండి రమణ గారి సమక్షంలో శుక్రవారం బీసీ సెల్ కమిటీని నియమించడం జరిగింది. ఇట్టి కమిటీలో సభ్యులుగా పసుపుల నరేష్ బోస్కర్ వేణు ఆద్యాల కాళిదాస్ గార్లను సభ్యులుగా నియమిస్తూ నియామక పత్రాలు అందజేసినారు. ఇట్టి సందర్భంగా వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు ఇదే ఉత్సాహంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో చురుగ్గా పనిచేయాలని, మన ఎంపీ సభ్యులైన జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఆయన అన్నారు. ఇట్టి సందర్భంగా రమణ మాట్లాడుతూ.. ఇదే ఉత్సాహంతో రాబోయే ఎన్నికల్లో కష్టపడి ఎంపీ సీటును అధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అలాగే ఇట్టి నియమకానికి సహకరించిన సాయిబాబా గౌడ్ వినయ్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Spread the love