బీఆర్ఎస్ కు మరో షాక్…!

నవతెలంగాణ హైదరాబాద్‌: బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్టు సీఎంకు ఆయన తెలిపారు. నేడో, రేపో అనుచరులతో కలిసి చేరతానని చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

Spread the love