నవతెలంగాణ – హైదరాబాద్: చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నేపథ్య గాయని ఉమా రమణన్ బుధవారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 72 ఏళ్లు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఉమా రామణన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకులను తన గాత్రంతో అలరించారు. అంతే కాదు, సుమారు ఆరువేల కంటే ఎక్కువ ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదు. అనారోగ్య కారణాల వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.