జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సాగర్ పదవీ విరమణ…

– ఇంచార్జి ప్రిన్సిపాల్ గా ఎం.డి యూసఫ్…
– ముఖ్య అతిథిగా హాజరైన డీఐఈఓ సులోచనారాణి
నవతెలంగాణ – అశ్వారావుపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.సాగర్ తన ఉద్యోగ విధులు నుండి శుక్రవారం పదవీ విరమణ పొందారు.ఇంచార్జి ప్రిన్సిపాల్ గా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ను యం.డి యూసఫ్ ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు నియమించారు.ఈ విరమణ కార్యక్రమానికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లా అధికారి బి.సులోచనారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో సిబ్బంది ఎస్.కే చాంద్ పాషా,అశోక్ బాబు,శ్రీనివాస్,డి.నరసింహారావు,రాంబాబు,అంజయ్య, మారేష్,సురేష్ లు పాల్గొన్నారు.
Spread the love