హైదరాబాద్ : టీఎంటీ బార్ల (ఇంటెలిజెంట్ స్టీల్) తయారీదారు అయిన కె2 జెనాక్స్ తెలంగాణలో తన విస్తరణను వేగవంతం చేస్తోన్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఏడాదిలో తన టిఎంటి బార్ ఉత్పత్తిని సామర్థ్యాన్ని 20 శాతం పెంచాలని యోచిస్తోన్నట్లు కె2 జెనాక్స్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ తెలిపారు. రాష్ట్రంలో మాసన్ మీట్, బిల్డర్ మీట్, తన ప్రత్యేక నిర్మాన్ కే షముర్ వీర్ కార్యక్రమాల ద్వారా డీలర్లు, పంపిణీ నెట్వర్క్ను క్రమంగా విస్తరిస్తోన్నామన్నారు. వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కలిగిన తెలంగాణ తమకు ముఖ్యమైన మార్కెట్ అని అన్నారు.
తెలంగాణలో వేగంగా విస్తరిస్తాం : కె2 జెనాక్స్
1:29 am