కల్యాణ లక్ష్మి చెక్కులపంపిణీ చేసిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ – పెద్దవంగర

కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శనివారం చెక్కులు పంపిణీ చేశారు. తొర్రూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్దవంగర మండలానికి చెందిన కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజా సంక్షేమ లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందిస్తూ, త్వరలోనే బంగారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బొమ్మెరబోయిన కల్పన రాజు యాదవ్, సీనియర్ నాయకులు తోటకూరి శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, ఎంపీటీసీ సభ్యులు బానోత్ రవీందర్ నాయక్, బానోత్ విజయ, ఈరెంటి అనురాధ, సీనియర్ నాయకులు సలిదండి సుధాకర్, మెట్టు నగేష్, పాకనాటి రామకృష్ణ రెడ్డి, జాటోత్ వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి ఓరిగంటి సతీష్, ఆరై భూక్య లష్కర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love