దేశంలోనే మొదటి స్థానంలో కామారెడ్డి ఎల్ఐసి బ్రాంచ్

 నవతెలంగాణ- రామారెడ్డి
 ఎల్ఐసి జాతీయం చేసిన జనవరి 19వ తేదీన చేసిన వ్యాపారంలో దేశంలోనే కామారెడ్డి బ్రాంచ్ మొదటి స్థానంలో నిలిచిందని బ్రాంచ్ మేనేజర్ తులసి రామ్ శుక్రవారం తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అత్యధిక పాలసీలు విక్రయించిన ఎల్ఐసి విస్తరణ అధికారులతో పాటు ఏజెంట్లను శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను ముఖ్యఅతిథిగా హాజరైన డివిజనల్ ఆఫీస్, నూతన వ్యాపార మేనేజర్ సుందర్ బాబు, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ చౌహన్, విస్తరణ అధికారులు వెంకటేశ్వర్లు, వీరేశలింగం, మారుతి, ఇక్బాల్ అహ్మద్, నరేష్, లియఫీ నాయకులు కొండ బైరయ్య, నారాయణ రావు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love