కరీంనగర్ లో భారీగా గంజాయి పట్టివేత..

– గ్గురిపై కేసు నమోదు
– 70 కిలోల గంజాయి స్వాధీనం
నవతెలంగాణ – కరీంనగర్ క్రైమ్
కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు శనివారం బైపాస్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో AP 31BH 2925 నెంబర్ గల స్విఫ్ట్ కారులో 70 కిలోల గంజాయి గుర్తించినట్లు కరీంనగర్ టౌన్ ఏసీపీ నరేందర్  తెలిపారు. కారులో ఉన్న ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఒడిశా నుండి మహారాష్ట్ర కు తరలిస్తున్నట్లు తెలిపారన్నారు. నిందితుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు కాగా ఒకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
A1. విశాఖ జిల్లా కొమ్మాదికి చెందిన సెరకనం రామకృష్ణ A2. కాకినాడ జిల్లా కిర్లంపూడి కి చెందిన దొడ్డి మణికంఠ (39) A3. మహారాష్ట్ర జిల్లా పబ్బని, భీమ్ నగర్ కు చెందిన ధర్మేంద్ర కుమార్ @ సల్మాన్ అన్సారీ(26) లుగా గుర్తించి వారిపై NDPS యాక్ట్ 1985 ప్రకారం 8(c) r/w 20(b)(ii)(c) సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. ఈ గంజాయి పట్టివేతకు కృషిచేసిన వన్ టౌన్ ఇన్స స్పెక్టర్ రిలాల్ ఎస్సై స్వామితో పాటు సిబ్బందిని టౌన్ ఏసీపీ అభినందించారు.
Spread the love