రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి: కర్ణ బ్రహ్మనందరెడ్డి

నవతెలంగాణ – నాగార్జునసాగర్
నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిని  పార్టీలకు అతీతంగా గెలిపించాలని కర్ణ బ్రహ్మానందరెడ్డి అన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నలగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో తోచని స్థితిలో ఉన్న బిఆర్ఎస్ ను వదిలి జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి చేయగల దమ్మున్న వ్యక్తి కావడంతో బిఅరెస్ ను వదిలి రఘు రెడ్డి గెలుపు కోసం కృషి చేసినట్టు తెలిపారు. వ్యక్తిగతంగా కుందూరు కుటుంభమంత మాజీ మంత్రి జానారెడ్డి, నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి రఘువీరారెడ్డి,ఎమ్మెల్యే జయవీర్ రెడ్డిలు వ్యక్తులను సైతం ఆపదలో ఆదుకునే గుణం కలిగిన వ్యక్తులు అందుకే రాజీనామా చేసి రఘువీరుడికి సంపూర్ణ మద్దతు తెలిపినట్టు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మాజీ నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ సలహాదారుడు కర్ణ శరత్ రెడ్డి, టిఆర్ఎస్ కు చెందిన ఒకటో వార్డు ఎస్టీ సెల్ అధ్యక్షులు కండేల వెంకటేశ్వర్లు మరియు 3వ వార్డు అధ్యక్షులు ఊర శ్రీనివాస్,యాదవ సంఘం సాగర్ అధ్యక్షులు వెంకటయ్య,టౌన్ కార్యదర్శి కృష్ణయ్య,7వ వార్డు అధ్యక్షులు కొండలు,5వ వార్డు అధ్యక్షులు సిరికొండ మధు,మహిళ అధ్యక్షురాలు మాధవి,కార్యదర్శి విజయ,నిరంజన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love