చింతల దామోదర్ రెడ్డిని అభినందించిన కేసీఆర్

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ పీఏసీ ఎస్ చైర్మన్ చింతల దామోదర్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులో బుధవారం అభినందించారు. ఇటీవల పీఏసీఎస్ ఛైర్మన్ చింతల దామోదర్ రెడ్డిపై అవినీతి మోపడంతో ఛైర్మన్ గా చింతల దామోదర్ రెడ్డిని తొలగించారు. కో- ఆపరేటివ్ సొసైటీ ట్రిబ్యునల్ లో గెలిచి మళ్లీ తిరిగి ఛైర్మన్ గా చింతల దామోదర్ రెడ్డి నియమకం అయ్యారు. ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు గొంగిడి మహేందర్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా సింగిల్ విండో చైర్మన్లు కెసిఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.
Spread the love