కేసిఆర్ హామీలు నీటి మూటలు..

– హుస్నాబాద్ అభివృద్ధి అవివేకానికి నిదర్శనం

– బీజేపీ నియోజకవర్గ నాయకురాలు మంజులారెడ్డి
నవ తెలంగాణ- హుస్నాబాద్ రూరల్:
సీఎం కేసిఆర్ హామీలు నీటి మూటలే తప్పా ప్రజలకు ఒరిగేదేమీ ఏమిలేదని, గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చినా 10 ఎండ్లు గడిచిన నేటికీ ఏ ఒక్క హామీ అమలు కాలేదని బీజేపీ నియోజకవర్గ నాయకురాలు సామాజిక సేవకురాలు కర్ణ కంటి మంజులరెడ్డి ఆరోపించారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హుస్నాబాద్ అభివృద్ధి చెందందని సతీష్ కుమార్  అనడం అవివేకానికి నిదర్శనమని, హుస్నాబాద్ చౌరస్తాలో నిలుచుంటే  అభివృద్ధి ఏందో తెలుస్తోందన్నారు. ఊరికో బెల్టు షాపు ఉంటే అభివృద్ధి అంటారా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మి మరోసారి ప్రజలు మోసపోవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధిపేట జిల్లా కోశాధికారి దొడ్డి శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్ మ్యాదరబోయిన వేణు యాదవ్, హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Spread the love