Saturday, September 12, 2026
E-PAPER
Homeజాతీయంభవిష్యత్తులో చైనా-భారత్‌లకు కీలక బాధ్యతలు

భవిష్యత్తులో చైనా-భారత్‌లకు కీలక బాధ్యతలు

- Advertisement -
  • చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

నవతెలంగాణ-హైదరాబాద్: చైనా, భారత్ తమ ద్వైపాక్షిక సంబంధాలను దీర్ఘకాలిక సంబంధాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మక దృక్పథంతో చూడాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు. శనివారం జాతీయ రాజధానిలో జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చైనా, భారత్ భిన్నమైనవి అయినప్పటికీ, “ఉమ్మడి అభివృద్ధిని సాధించడానికి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోగలిగాయి” అని షీ స్పష్టం చేశారు.

“న్యూఢిల్లీ బ్రిక్స్ సదస్సుకు హాజరవడం, మిమ్మల్ని మళ్లీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో జరిగిన బ్రిక్స్ సదస్సు విజయవంతమైనందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను,” అని చైనా అధ్యక్షుడు అన్నారు.

భవిష్యత్తు విషయంలో చైనా-భారత్‌లకు కీలక బాధ్యతలు ఉన్నాయి. రెండు దేశాలు ఒకరి బలాల నుండి మరొకరు నేర్చుకుంటూ ఉమ్మడి అభివృద్ధిని సాధించగలవని , విస్తృతమైన బ్రిక్స్ (BRICS) సహకారం ద్వారా అత్యున్నత స్థాయి అభివృద్ధిని సాధించేందుకు రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -