- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండల కేంద్రంలో శనివారం సీపీఐ(ఎం) మండల పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి 2వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, మండల కమిటీ సభ్యులు ఏరుకొండ రాఘవేంద్ర, దామెర లక్ష్మి, ఎడ్ల అంజయ్య, ఏరుకొండ యాదయ్య, దామెర బిందు, ఇస్తారి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



