బాధిత కుటుంబానికి కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ చేయూత

నవతెలంగాణ ధర్మారం
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేట గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన కొత్త రాములు గత ఐదు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. రాములు కు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరి కూతుర్లను కూలి పని చేసుకుంటూ చదివించాడు. పెద్దమ్మాయికి పెళ్లి చేయగా ఆమెకు ఒక బాబు పుట్టిన తర్వాత తన భర్త, దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.తన ఇద్దరు కూతుర్లు ఇంటి దగ్గరే ఉండటం వలన, అతని ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉండడంతో తీవ్ర  మనోవేదనతో, ఆలోచనలతో రాత్రి నిద్రిస్తున్న సమయంలో గుండె పోటుతో మృతి చెందాడు. వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ సభ్యుడు ఎలుక రాజు యాదవ్ ను సంప్రదించగా, పరిస్థితిని కెనడాలో ఉన్న ఎన్ఆర్ఐ కోలుముల దామోదర్ యాదవ్ కు ఎలుక రాజు యాదవ్ చరవాణి ద్వారా తెలియజేయగా,  వెంటనే స్పందించిన ఆయన తక్షణ, తాత్కాలిక సాయంగా శుక్రవారం సుమారుగా రూ.10,000/- విలువగల నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా రాములు కుటుంబ సభ్యులు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ సభ్యులు ఎలుక రాజు యాదవ్, స్థానిక కాంగ్రెస్ నాయకుడు మల్లారెడ్డి, పుల్లకొల్ల లింగమూర్తి, సురేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love