సాగర్ ఫ్లైఓవర్ ప్రమాద బాధితులను పరామర్శించిన కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్: సాగర్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని ఫ్లైఓవర్ నిర్మాణ పనుల సందర్భంగా ప్రమాదం చోటు చేసుకోగా, పలువురు గాయపడ్డారు. బాధితులు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు పూర్తి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాఫ్తుకు జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

 

Spread the love