కూడవెళ్లి వాగులోకి జలకళ

నవతెలంగాణ-తొగుట
గత కొద్ది రోజులుగా బుగర్బా జలాలు తగ్గిపోవడం తో బోర్లు, బావులు, వాగులు,  వంకలలో సైతం నీటి ఎద్దడి ఏర్పడింది. బుధవారం ఆయా ప్రదేశాల లో పంటలు ఎండు ముకం పట్టడంతో కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు కూడవెళ్లి వాగులోకి నీరు విడుదల చేయాలని రైతులు కోరా రు. ఈ విషయం పై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి గజ్వేల్ సమీపంలోని కొడుకండ్ల వద్ద మల్లన్నసాగర్ నుండి కొండ పోచమ్మ సాగర్ కు వెళ్లే నీటిని వాగులోకి విడుదల చేశారు. బుధవారం ఉదయం  మండలంలోని చందాపూర్ వద్దకు మొండి మత్తడి వద్దకు నీరు చేరుకుందని మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు తెలిపారు.
Spread the love