అక్కంపల్లి మదర్ సాబ్ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన : కుంభం

నవతెలంగాణ- వలిగొండ రూరల్ : ఈనెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా  అక్కంపల్లి గ్రామంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ప్రచారం నిర్వహించారు. అనంతరం మదర్ సాబ్ దర్గా దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందజేశారు. వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అక్కంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేశి రెడ్డి వీరారెడ్డి, ఉపాధ్యక్షులు బుంగ పట్ల మత్స్యగిరి, యూత్ అధ్యక్షులు నిమ్మల కృష్ణ, కేశ బోయిన శంకరయ్య, కేశ బోయిన నరసింహ, మందడి ఎల్లారెడ్డి, కందుల బాలిశ్వర్, దేశి రెడ్డి సాయి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love