దొరలకు రాజకీయ సమాధి కడతాం… 

నవతెలంగాణ- చివ్వేంల: దొరలకు రాజకీయ సమాధి కడతామని యాదవ సంఘం విద్యావంతుల వేదిక లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుంకర బోయిన రాజు, బి ఎస్పి జిల్లా నాయకులు  దేశబోయిన సురేష్  అన్నారు. సోమవారం చివ్వేంల మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బి ఎస్ పి పార్టీ మండల కమిటి ఆధ్వర్యంలో మూతికి  నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు.అనంతరం వారు  మాట్లాడుతూ, ఆదివారం ఆత్మకూరు(ఏస్), మండలం గటికల్లు గ్రామంలో బిఎస్పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ పై  దాడికి పాల్పడం హేయమైన చర్య అన్నారు. బహుజన రాజ్యం ఏర్పాటు కోసం బీసీ బిడ్డ పోరాడుతుంటే ప్రజలలో బీఎస్పీ పార్టీ ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నారనితెలిపారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల  రాజ్యాధికారం కోసం పోరాడుతుంటే, దొరలు ఇలాంటి అరాచకాలకు పాల్పడు తున్నారని బహుజనులపై దాడి చేస్తే  మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. ఓటు ద్వారా దొరలకు బుద్ధి చెప్పడానికి బహుజనులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గం లో బి ఎస్ పి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ ను ప్రజలు గెలిపించి దొరలను  సూర్యాపేట నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఎస్ పి నాయకులు  సైదులు, ప్రవీణ్, సాయి, జానయ్య, స్టాలిన్, శ్యాం,కృష్ణ, శ్రీకాంత్, మధు, ఉపేందర్, కిరణ్, సారయ్య, నగేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు…
Spread the love