అంటరానితనాన్ని నిర్మూలిద్దాం: ఎస్సై ఆంజనేయులు 

నవతెలంగాణ – కొనరావుపేట
అంటరానితనాన్ని నిర్మూలించాలని కొనరావుపేట ఎస్సై ఆంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని మామిడిపల్లి  గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామంలోని దళితవాడలో సమావేశం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులచే ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. కులాల పేరుతో దూషించవద్దని అందరు సమానంగా ఉండాలని దళితులకు దేవాలయాల్లో హోటల్లో అందరితో సమానంగా చూడాలని, కులాల పేరుతో దూషిస్తే వారిపై కఠి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఆర్ఐ జి రజిని, దళిత సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love