కనీస వేతనాలు, రెగ్యులరైజేషన్ కై పోరాడుదాం..

నవతెలంగాణ – మాక్లూర్
నాన్ టీచింగ్ , వర్కర్స్ కనీస వేతనాలు, రెగ్యూలరైజేశన్ కై పోరాడాలని యూనియన్ రాష్ట్ర నాయకురాలు బి. ఈశ్వరి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ & వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియూ) ఆధ్వర్యంలో నాన్ టీచింగ్, వర్కర్స్ డిమాండ్లతో కూడిన క్యాలెండర్ పాఠశాల ప్రత్యేక అధికారిని ప్రగతి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు బి.ఈశ్వరి మాట్లాడుతూ కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ & వర్కర్స్ కు ఇప్పటికీ కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ లాంటి ఆరోగ్య, ఉద్యోగ భద్రత లేదన్నారు. కనీస వేతనాలు అమలు కాక, శ్రమదోపిడికి గురవుతున్నారనీ,. కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.60 కూడా వీరికి అమలు కావడం లేదన్నారు. పని భారం పెరిగినా ఖాళీలు భర్తీ చేయడం లేదని, ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన కేజీబీవీల్లో పనిభారం మరింత తీవ్రంగా ఉందన్నారు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. కేజీబీవీల్లో పనిచేసిన సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగాల్లో సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలన్నారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన కేజీబీవీల్లో కుక్, స్వీపర్, అటెండర్, స్కావేంజర్ పోస్టులను భర్తీ చేయాలనీ, కంప్యూటర్, ఒకేషనల్ ట్రైనర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలని ఏ.ఎన్.ఎంల నైట్ డ్యూటీలను 03 రోజుల నుండి ఒక రోజుకు తగ్గించాలనీ, పదవీ విరమణ చేసిన వారికి గ్రాట్యుటీ చెల్లించాలని, చనిపోయిన వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల డిమాండ్లను తుంగలో తొక్కిన కేసీఆర్ సర్కారుకు గద్దె దింపామని, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో పై డిమాండ్ల సాధన కోసం యూనియన్ నాయకత్వంలో పోరాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది మోతి, రమ, శారద, విజయమ్మ, చంద్రకళ, నిర్మల, సావిత్రి, ఆండాలు, సాయమ్మ, తోయాబా తదితరులు పాల్గొన్నారు.
Spread the love