బ్లాక్ మెయిల్ రాజకీయాలను తరిమికొడదాం: ఎర్రబెల్లి దయాకర్ రావు

నవతెలంగాణ – రాయపర్తి
రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలను విద్యావంతులు తరిమికొట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను నమ్మి మోసపోయారని ఇప్పటికైనా విద్యావంతులు కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీతోనే నిరుద్యోగ సమస్య నెరవేరుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వేషాలు మూడు నాళ్ల ముచ్చటగానే కనుమరుగవుతుందన్నారు. రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తేరపడాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని వివరించారు. ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఎన్నికల ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహ రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, పార్టీ మండల అధ్య6నరసింహ నాయక్, ఉపాధ్యక్షుడు ఎండీ నాయిమ్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love