మాతృ భాష‌ను స‌జీవంగా నిలుపుదాం

Let's keep the mother tongue aliveభావవ్యక్తీకరణ వారధియే భాష
భాష వికాసం ఒక నిరంతర ప్రక్రియ. సమాజపు అలవాట్లు, పరిస్థితులను బట్టి భాషా పరిణామం వేగంగా పంచుకుంటుంది. అది ఎప్పుడూ ఆగదు. భాష ఒక జీవనది లాంటిది. నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. భాష ఆవిర్భావం ఏ ఒక్క వ్యక్తి చేతగానీ, ఏ ఒక్క కాలంలో గాని జరగలేదు. భాష తరతరాలుగా ఎందరో వ్యక్తుల కషిచే ఏర్పడిన ఒక వ్యవస్థ. భాష నాగరికతలో ఒక ముఖ్యమైన అంశం. ఇది మనిషి పాశవిక స్థాయి నుంచి అత్యుత్తమైన మానవుని స్థాయికి చేరుకోవడానికి తోడ్పడుతుంది. భాష లేకుంటే మనిషి మనిషిగా సంపూర్ణ మనగడ పొందలేడు. వ్యక్తుల మధ్య ప్రసారమాధ్యంగానే కాకుండా భాష వ్యక్తి మూర్తిమత్యానికి ప్రతిబింబంగా నిలుస్తుంది. శిశువుగా వున్నప్పటినుండి భాష ద్వారానే ప్రాపంచిక విషయాలను తెలుసుకోగలుగుతాడు. మనిషి జీవితంలో ఇంతటి బహుముఖ ప్రాముఖ్యత కలిగిన భాష విద్యారంగంలో ప్రధానమైన భూమిక వహిస్తుంది. విద్య బోధన, అభ్యాసనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు భాష ద్వారానే నిర్వర్తించబడతాయి. భాష లేకుంటే విద్యా ప్రక్రియ సాధ్యం కాదు. విద్యార్థి జ్ఞాన సముపార్జనకు, మూర్తిమత్వ వికాసానికి భాషయే ఆధారం. సమాజపు గుర్తింపుకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ. నేడు ప్రపంచం అన్ని రంగాల్లో అభివద్ధి చెందుతున్నప్పటికీ ఆంగ్లం లాంటి పరభాషల మోజులో అనేక దేశాలు తమ మాతభాష పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం వలన క్రమక్రమంగా మాతభాషలు మత భాషలుగా మారిపోతున్నాయి. ఈ మత భాష జాబితాలో తెలుగు భాష ఉండడం అత్యంత బాధాకరమైన విషయం. ఏ మాతభాష అయితే నిర్లక్ష్యానికి గురవుతుందో అనగా మాతభాష విద్యా బోధన జరగనట్లయితే ఆ భాష 40 సంవత్సరాలలో నశించిపోతుందని యునెస్కో తెలిపింది.
ప్రమాద అంచున మాతభాషలు:
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతభాష. ”తల్లి ఒడి బిడ్డకు తొలి బడి” తన తల్లి అని ఎవరు చెప్పకుండానే అప్రమయంగా అమ్మ అని బిడ్డ ఎలా పిలుస్తుండో మాతభాష కూడా సహజంగా అలాగే వస్తుంది.
యునెస్కో కు చెందిన సాంస్కతిక విభాగం ప్రపంచంలోని అల్పసంఖ్యాక భాషల పరిరక్షణకై సభ్య దేశాలలో జాగతిని కలుగజేయాలన్న ఉద్దేశంతో ప్రపంచ భాషల స్థితిగతులను, వాటి మనుగడలను గురించిన అధ్యయనాన్ని 1994 సంవత్సరం లో మొదలుపెట్టింది. ఈ అధ్యయనంలో భాగంగా అంతరించిపోయే అవకాశం ఉన్న భాషలను గుర్తించి అట్లాస్‌ రూపంలో ప్రచురిస్తుంది. దీనినే ‘ప్రమాదంలో ఉన్న ప్రపంచ భాషల అట్లాస్‌’ అంటారు. ప్రపంచంలో సుమారు 7 దేశాల్లో 230 భాషలు పూర్తిగా అంతరించాయి. ఇంకా 2500 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో ప్రకటించింది. ఒక భాషను మాట్లాడే జనాభాలో 30% మంది చదవకుండా మాతభాషకు దూరమైతే కాలక్రమంలో ఆ భాష మత భాషగా మారిపోతుందని యునెస్కో ఇటీవలే ప్రకటించింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు వారాలకు ఒక భాష కనుమరుగైపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే భారతదేశంలో 40 భాషలు, మాండలికాలు అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన గదబ, నైకి, అనే గిరిజన తెగల భాషలు ఉండడం ఎంతో బాధాకరం. ప్రతి పౌరుడు అమ్మను కాపాడుకున్నట్టే అమ్మలాంటి మాతభాషను కూడా కాపాడుకోవాలి. మనిషి మనగడ కోసం పరభాషలను నేర్చుకోవడం తప్పేం కాదు. కానీ అమతం లాంటి అమ్మభాషను నిర్లక్ష్యం చేయకుండా పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం. అందుకే అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం జరుపుకుంటారు.
అంతర్జాతీయ మాతభాషా దినోత్సవ నేపథ్యం:
అమ్మలాంటి మాతభాషను పరిరక్షించుకోవాలని భావనతోనే 1999 సంవత్సరంలో నవంబర్‌ 17న యునెస్కో 30వ మహాసభలో ఫిబ్రవరి 21 తేదీన అంతర్జాతీయ మాతభాషా దినోత్సవంగా ప్రకటించింది. దీని వెనక పెద్ద సంఘటన దాగి ఉంది. బంగ్లాదేశ్‌హొ(అప్పటి తూర్పు పాకిస్థానీలు) చేసిన భాషా ఉద్యమానికి నివాళిగా ప్రతి ఏటా ఈ అంతర్జాతీయ మాతభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1947 లోహొభారతదేశం, పాకిస్తాన్‌ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్‌ రెండుహొభౌగోళికంగాహొవేర్వేరు భాగాలు ఏర్పడింది. ఒకటిహొ తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అని పిలుస్తారు) రెండవదిహొపశ్చిమ పాకిస్తాన్‌ (ప్రస్తుతం పాకిస్తాన్‌ అని పిలుస్తారు).హొసంస్కతి, భాషహొమొదలైన వాటిలో రెండు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు భాగాలను భారతదేశం వేరు చేసింది. తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పుడు బంగ్లాదేశ్‌), పశ్చిమ పాకిస్తాన్‌ (ఇప్పుడు పాకిస్తాన్‌) కలిపి మెజారిటీ ప్రజలుహొబెంగాలీహొలేదా బంగ్లా భాష ఎక్కువగా మాట్లాడేవారు.1948 లో అప్పటి పాకిస్తాన్‌ ప్రభుత్వంహొఉర్దూహొపాకిస్తాన్‌ జాతీయ భాషగా ప్రకటించింది. దీనికి తూర్పు పాకిస్తాన్‌ ప్రజలు అభ్యంతరం తెలిపారు. తూర్పు పాకిస్తాన్‌ జనాభాలో ఎక్కువ భాగం బెంగాలీ మాట్లాడుతారు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయ భాషలలో ఒకటిగా ఉండాలని వారు డిమాండ్‌ చేశారు. భాష సమాన హోదా కోసం ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమం 1952 సంవత్సరం నుండి 1956 వరకు కొనసాగింది. ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం మేధావులను, అధ్యాపకులను జైల్లో వేసింది. ఫిబ్రవరి 21న వారిపై కాల్పులు కూడా జరిపింది మాతభాష కోసం మొదలుపెట్టిన ఈ ఉద్యమంలో యువకుల నెత్తురు ఏరులై పారింది. దాని పర్యవసారం ప్రభుత్వం దిగివచ్చింది. 1953 నుండి బంగ్లాదేశ్‌ ప్రజలు ఫిబ్రవరి 21 తేదీని మాతభాష కోసం పోరాడి, అసువులు బారిన యువకుల త్యాగాలకు గుర్తుగా అంతర్జాతీయ మాతభాషా దినోత్సవంగా ప్రకటించింది. తరువాత 2000 సంవత్సరం నుండి ప్రతి ఏటా చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కతిక, వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనమందరం జీవవైవిద్యాన్ని కాపాడుకోగలమని, బహు భాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దష్టిని, శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో తెలిపింది. అమ్మలాంటి మాతభాషను కాపాడుకుంటూనే దానితోపాటు ఇతర భాషలన్నింటినీ నేర్చుకోవడం అనంత విజ్ఞానాన్ని పొందడానికి సరైన మార్గం.
బహు భాషా విద్య ప్రాముఖ్యత
బహుభాషా విద్య సమ్మిళిత సమాజాలను ప్రోత్సహించడం, స్వదేశీ భాషలను సంరక్షించడంలో సహాయపడుతుంది. అందరి వ్యక్తులకు విద్య సమ ప్రాప్యత, జీవితాంతం నేర్చుకునే అవకాశాలను సాధించడానికి ఇది ఒక మూల స్తంభం అని చెప్పవచ్చు. 2024 అంతర్జాతీయ మాతభాషా దినోత్సవ వేడుకల ఇతివత్తం ‘బహుభాషా విద్య అభ్యాసానికి, తరాల తరబడి అభ్యాసానికి మూల స్తంభం’. యునెస్కో ఇలా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ఒక థీమ్‌ ను ప్రకటిస్తుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ల మంది పిల్లలు చదువుకోవడం లేదు, ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలు నేర్చుకోవడం లేదు. అంతర్జాతీయ మాతభాషా దినోత్సవం 2024 సంవత్సరంలో సమ్మిళిత నాణ్యమైన విద్య, జీవితకాల అభ్యాసంపై సుస్థిర అభివద్ధి లక్ష్యం, దేశీయ భాషలపై అంతర్జాతీయ (2022 -2032) లక్ష్యాలకు మద్దతు ఇవ్వడం యునెస్కో లక్ష్యంగా పెట్టుకుంది. బహుభాషా విద్య తరతరాలుగా అభ్యసించడానికి, సంస్కతి, వారసత్వాన్ని కాపాడుకోవడానికి, భాషల పునర్జీవనానికి ద్వారాలు తెరవడానికి ఎంతో దోహదం చేస్తుంది. డిజిటల్‌ అక్షరాస్యతకు బహు భాషా విద్య చాలా అవసరం. బహు భాషా విద్య జీవిత నైపుణ్యాలు సంపాదించడంలో ఎంతో సహాయపడుతుంది. భాషా సాంస్కతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవవైవిద్యాన్ని కాపాడుకోగలుగుతాం. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించడం వలన అది విశాల దష్టిని, శాస్త్రీయ దక్పథాన్ని పెంపొందిస్తుంది.
మాతభాషల మాధుర్యం
మాతభాష చక్కని మాధుర్యానికి, పలుకుబడులకు, నుడికారములకు పుట్టినిల్లు. ‘దేశ భాషలయందు తెలుగు లెస్స’ అని శ్రీకష్ణ దేవరాయలు చెప్పిన మాట మాతభాషాభిమాననికి మేలుకొలుపు లాంటిది. ‘తేనేతేటల నవకుంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషమ తల్లి’ అని సురవరం ప్రతాపరెడ్డి కీర్తించినారు. పాశ్చాత్య మేధావులు సైతం ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌’ అని మన తెలుగుభాష గొప్పతనాన్ని ప్రశంసించారు. నిజానికి మాతభాష మమకారం మానవ సంబంధాలను బలంగా ముడి వేస్తుంది. ప్రాశ్చాత్య సంస్కతి, నాగరికత, భాషా ప్రభావాల వల్ల ప్రాంతీయ బేధాల్లో చక్కగా ఉన్నప్పటికీ అంతుచిక్కకుండా పోతున్నాయి. వ్యక్తుల మధ్య దూరం పెరుగుతుంది. మాతభాష మూలాలు కలిగిన కుటుంబాల్లో మాత్రం మాతభూమిపై వికసిస్తున్నాయి. తల్లి వంటి తెలుగు భాష తల్లడిల్లి పోతుంది. తనయులమైన తెలుగు వాళ్లమంతా అమతం లాంటి అమ్మ భాషను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుడి పైన ఉంది.

Spread the love