టిడిపి సత్తా చాటుదాం 

– టిడిపి సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి నాతాల రామిరెడ్డి

నవతెలంగాణ- పెన్ పహాడ్:
రానున్న ఎన్నికల్లో టిడిపి సత్తా చాటుదామని టిడిపి సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్థి నాతాల రామిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సత్య గార్డెన్స్ లో గురువారం నిర్వహించిన టిడిపి మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కుచెదరలేదని, రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తన అత్యంత మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం వైఎస్ఆర్టిపి మండలాధ్యక్షుడుగా కొనసాగుతున్న తాడోజు జనార్ధనాచారికి పార్టీ జెండా కప్పి ఆహ్వానం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సెట్టిపల్లి సైదులు, మండల ప్రధాన కార్యదర్శి రాయిరాల వంశీ, ఉపాధ్యక్షులు షేక్ అలి సాహెబ్, కొండమీది గోపయ్య, గొట్టిపర్తి గోపయ్య, కుంచం శ్రీను, లక్ష్మి నారాయణ, సోమయ్య, రామస్వామి, వివిధ గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love