మల్లంకుంటను మినీ ట్యాంక్ బండ్ గా అభివృద్ధి చేస్తా..

– గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ .
నవతెలంగాణ – అచ్చంపేట : పట్టణంలోని మల్లంకుంటను మినీ ట్యాంక్ బండ్ గా పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం మల్లం కుంట పరిసరాలను పరిశీలించారు. పట్టణ ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మల్లంకుంటను ఇరువైపులా  మరింత పెద్దగా విస్తరించి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి ఒక సంవత్సరం లోపల పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని… మాటలు చెప్పడం కాదు చేసి చూపిస్తా అన్నారు. కాలనీవాసులు పట్టణ ప్రజలందరూ సహకరించాలన్నారు. ఇరిగేషన్ ఏఈ రమేష్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ శ్రీహరి రాజు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు రఘురాం, కౌన్సిలర్ గౌరీ శంకర్, చందు, సీనియర్ నాయకులు వేరే శ్రీనివాసులు, రమేష్, కబలవై శేఖర్, తిరుపతయ్య గౌడ్, మహిళా నాయకులు శారదమ్మ, తదితరులు ఉన్నారు.
Spread the love