విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

నవతెలంగాణ – తొగుట
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో చోటుచేసు కుంది. మంగళవారం ఎస్ఐ బి.లింగం తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చింత నరసింహులు (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం మిషన్ భగీరథ నీరు అందరికీ వస్తుండేవి. ప్రతి రోజు కొందరు ఆ సమయంలో నల్లలకు మోటార్లు పెట్టడం వల్ల గ్రామంలో అందరికీ, తన ఇంటిలో నల్లా నీళ్లు రావడం లేదని నర్సింలు భావించాడు. ట్రాన్స్ఫార్మర్ బందు చేస్తేనే బోరు మోటర్లు బందై వారికి నీళ్లు వస్తాయనీ గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్ళాడు. ట్రాన్స్ఫార్మర్ జంపర్ మార్చుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతు ని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Spread the love