చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపెళ్లి నెల్లికుదురు మధ్యలో ఉన్న ఆఖరి వాగులో చేపల వేటకు వెళ్లి విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందినట్లు నెల్లికుదురు ఎస్సై కనుకుల క్రాంతి కిరణ్ తెలిపాడు. శుక్రవారం మృతి చెందిన గుగులోతు రవి ఆయన భార్య సుజాత ఇచ్చిన పిడిషన్ మేరకు ఘటనా స్థలానికి తొర్రూరు సిఐ టి సంజీవ్ ఎస్సై క్రాంతి కిరణ్ లు పరిశీలించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని రత్తి రామ్ తండా గ్రామానికి చెందిన గుగులోతు రవి (45) ని తన స్నేహితులైన జామ తండా కు చెందిన గుగులోతు నరేష్, రవిలు చేపల వేటకు తీసుకువెళ్లి అక్రమంగా విద్యుత్ వైర్లు ఏర్పాటు చేసుకుని చేపలు పడుతున్న క్రమంలో విద్యుత్ షాక్ కు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు తెలిపారు. తన భర్త మృతికి కారణమైన నరేష్ రవీలపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ నాకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపారు. కాగా మృతుడికి కుమార్తె కుమారుడు ఉన్నారు.
Spread the love