గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు పలువురు అభినందనలు

నవతెలంగాణ – ఉప్పునుంతల
5వ తరగతి గురుకుల సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. శుక్రవారం వెలువడిన 5వ తరగతి గురుకుల ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల్లో ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా బాలుర ప్రాథమిక పాఠశాల ఉప్పునుంతల నుండి ఏడుగురు విద్యార్థులు ఆడేపు మురళి – అచ్చంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో, మస్కూరి అరవింద్ – లింగాల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో, బొల్లె ప్రవీణ, నడిగడ్డ వరలక్ష్మి, ఆలూరి పల్లవి, పొట్టల సిరి లకు బాలికల సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మన్ననూర్ లో, మేకల అక్షర – వంగూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నారాయణ, ఉపాధ్యాయులు బాలమణి, శ్రీనివాసులు, వెంకటేష్, పద్మావతి విద్యార్థులను అభినందించారు. బాగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించడం జరిగింది. ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, మండల విద్యాశాఖ అధికారి రామారావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్.ఎల్.ఎన్ నోడల్ అధికారి చంద్రశేఖర్ ఉపాధ్యాయుల కృషిని అభినందించారు.
Spread the love